MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని నేడు చంద్రగ్రహణం సందర్భంగా ద్వారబంధనం చేశారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం ప్రధాన ద్వారాన్ని అర్చకులు, నిర్వాహకులు శాస్త్రోక్తంగా ద్వారబంధనం చేశారు. గ్రహణం ముగిసిన తర్వాత బుధవారం ఉ. 6 గం పుణ్యాహవాచనం, సంప్రోక్షణ పూజలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.