HYD: అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లులు వచ్చేలా చూస్తున్నామని బహదూర్పురా ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అన్నారు. గురువారం నియోజకవర్గానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పారదర్శకంగా ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.