కృష్ణా: ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో నాగాయలంక, ఏటిమొగ, గుల్లలమోద, సొర్లగొంది, పాలకాయతిప్ప, పాత ఉపకాలి గ్రామాలకు చెందిన 332 మంది మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. మండలి వెంకట్రామ్, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు.