భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం ఓ ప్రైవేట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటుచేసారు. ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, BRS రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి సందర్శించారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగ పరుచుకోవాలని వారు సూచించారు.