SRD: కేజీబీవీ, యూఆర్ఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు.