NZB: జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నేడు నిర్వహించే, ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని, వచ్చిన దరఖాస్తులను, వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 10 గం.నుండి మధ్యాహ్నం 1 గం.వరకు నిర్వహిస్తామన్నారు.