ASF: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్ పూర్ ప్రాజెక్టులో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు మృతి చెందారు. బుధవారం నీటిలో గల్లంతైన అర్మాన్ మృతదేహం గురువారం లభ్యమైంది. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.