NGKL: జిల్లాలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికను అధికారులు సవాల్గా తీసుకుని విజయవంతం చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్కు సూచించారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభల్లో తాగునీరు, పథకాల లబ్ధిదారుల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒక అంశం (థీమ్)పై సమీక్ష నిర్వహిస్తూ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.