HYD: నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న 1.26 లక్షల ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆటో యజమానులకు రెట్రోఫిట్మెంట్ ఎలక్ట్రిక్ కిట్లు 100 శాతం సబ్సిడీతో అందించనుంది. కాగా, ఒక్కో ఆటోకు సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది.