RR: షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 2025-26 సంవత్సరానికి గాను పురపాలక సంస్థకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుతో పాటు నీటి పన్నును చెల్లించాలని పురపాలక శాఖ అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించని వారిపై పురపాలక సంస్థ చట్టం-2019 ప్రకారం ఆస్తి జప్తు చేయడం జరుగుతుందన్నారు. నీటి పన్ను బకాయిలు చెల్లించని వారి కలెక్షన్ తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.