TPT: రుయా ఆసుపత్రి వైద్యులు ఏలూరుకు చెందిన సుబ్బారావు కడుపులో 10 కేజీల భారీ ప్లీహాన్ని తొలగించి ప్రాణదానం చేశారు. అనేక ఆసుపత్రులు తిరిగినా రోగికి ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. రక్తహీనత, తక్కువ ప్లేట్లెట్లతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి డా. శ్రీకాంత్ రెడ్డి బృందం ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది.