SKLM: శ్రీ ముఖ లింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఇవాళ జలుమూరు మండలంలోని ఉన్న శ్రీ ముఖలింగేశ్వర ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని ఆయన అన్నారు.