VZM: కొఠియా గ్రామాల వివాదంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు. జిల్లా కార్యాలయంలో ఇవాళ ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి చొరవ చూపకపోతే అమాయక గిరిజనులు నలిగిపోతారని తెలిపారు.