SKLM: మందస మండల దళితుల సమస్యలు పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కొంకడాపుట్టి గ్రామంలో దళిత మహిళ భూమి ఆక్రమణ, లోహరిబందలో దళితులకు కేటాయించిన భూముల ఆక్రమణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.