KDP: వేముల మండలంలో రైతులకు 40% సబ్సిడీపై వేరుశనగ కాయల పంపిణీ కోసం నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభించినట్లు ఏవో ఓబులేసు తెలిపారు. మండలానికి 260 క్వింటాళ్ల వేరుశనగ కాయలు మంజూరయ్యాయన్నారు. క్వింటాల్ ధర రూ.10,200 కాగా, రూ. 4,080 సబ్సిడీ లభించడంతో రైతులు రూ. 6,120 చెల్లించాలన్నారు. వేరుశనగ సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.