PLD: అమరావతి మండలంలో ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష రాసేందుకు 145 మంది విద్యార్థులు శనివారం హాజరయ్యారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు ఇబ్బందులకు గురయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వివిధ వాహనాల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు.