సత్యసాయి: మడకశిర ప్రాంతంలో వరుసగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం శనివారం తెలిపారు. ప్రత్యేక నిఘా, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.