విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానిపురంలోని NDA కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వినతులు స్వీకరించారు. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. సుజనా ఫౌండేషన్, సీడ్స్, క్రిస్ప్ సహకారంతో అంగన్ వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.