E.G: కోరుకొండలోని MLA బత్తుల బలరామకృష్ణ కార్యాలయంలో శ్రీరంగపట్నం ప్రాంత రైతులతో ఆయన శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ ప్రాంతంలో బురద కాలువ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను, కాలువ పూడిక నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యపై తక్షణమే స్పందించి, ముందస్తు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.