NDL: జూపాడు బంగ్లా ఆర్ అండ్ బీ ఏఈ తెలుగు రమేష్ బాబు రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఇవాళ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో కాంట్రాక్టర్ నుంచి ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సోమన్న అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.