KRNL: అనుమతులు లేని బళ్లారి, ధనలక్ష్మి రకం కందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు హెచ్చరించారు. పత్తికొండలో ఇవాళ ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి డీలర్లకు సూచనలు చేశారు. రైతులు లైసెన్సు పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు.