SKLM: పాతపట్నం మండలం రౌతు లక్ష్మీపురంకి చెందిన కే. సరస్వతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మేరకు ఆమె సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చెయ్యగా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 3 లక్షలు చెక్కును స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు శనివారం తన కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు.