జింబాబ్వేతో రేపు జరగనున్న మ్యాచ్లో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ను ఓపెనర్గా ఆడించాలని మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపాడు. ఇషాన్ కిషన్ను వన్ డౌన్లో పంపించాలన్నాడు. దీంతో లెఫ్ట్&రైట్ ఓపెనింగ్ జోడీతో బౌలర్లపై ఆధిపత్యం సాధించవచ్చన్నాడు. ఒకవేళ శాంసన్కు తుది జట్టులో చోటు దక్కకపోతే.. వన్ డౌన్లో సూర్య రావాలని సూచించాడు.