భారత్ ఈ ఏడాది OCT-NOVలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి ఆతిథ్య జట్టుతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అలాగే 5 T20లు, 2 టెస్టుల సిరీసుల్లోనూ తలపడనుంది. అయితే 2027 వరల్డ్ కప్ ముంగిట 3 వన్డేలకు బదులు 5 ఆడాలని, 5 T20లకు బదులు 3 సరిపోతాయని BCCIకి NZC ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే నిజమైతే టీమిండియాకు ప్రాక్టీస్, అభిమానులకు రోహిత్-కోహ్లీని అదనంగా 2 వన్డేల్లో చూసేందుకు అవకాశం లభిస్తుంది.