TG: హోలీ పండుగ సందర్భంగా బలవంతంగా ఇతరుల మీద రంగులు వేయొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మహిళలతో అభ్యంతకరంగా ప్రవర్తించవద్దన్నారు. షీ టీమ్స్ గస్తీలో ఉంటాయని.. ఆకాతాయిల కదలికలను పరిశీలిస్తాయని హెచ్చరించారు. మద్యం దుకాణాలు ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలన్నారు.
PPM: బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్ ధ్యేయంగా సేవలందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డా. టి. జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతీ రోజూ పిల్లలకు అందుతున్న ఆరోగ్య సేవలు మరియు మెరుగవుతున్న తీరుపై సిబ్బందితో సమీక్షించారు. 4Dలుగా గుర్తింపబడిన శారీరిక ,మానసిక వైకల్యం, ఎదుగుదల తనికీలు నిర్వహిచారు.
శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస మీదుగా పాలకొండ వెళ్లే బస్సుల్లో విద్యార్థులు ఫుట్ బోర్డుల పై వేలాడుతూ ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలు ముగిసే సమయానికి తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.
HNK: హన్మకొండ జిల్లాలోని ప్రజలందరికీ సోమవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై ప్రతీకగా హోలీ పండగ జరుపుకుంటారన్నారు. సహజసిద్ధ రంగులనే వినియోగించాలని, రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.
HYD: AIMIM ఆధ్వర్యంలో సోమవారం మలక్పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్ నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.
W.G: తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం పీఎంశ్రీ ప్రోగ్రాం సెంట్రల్ కమిటీ మెంబర్ హేమ జైస్వాల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఆమె తనిఖీ చేశారు. పీఎం శ్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ క్లాసు రూమ్, అటెండెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నారు.
అనంతపురం నగరంలోని ఎస్సీ హాస్టల్లో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పరమేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు రూ. 3000కు పెంచాలని, సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
MDK: కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో వివో 1, 2 మహిళా సమైక్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఎన్నికల హామీలలో ఆమె మేరకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకమ్మ నరసింహులు, సీసీ వెంకటేశం, వీవోలు, ఓబి అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90 శాతం కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలుండవచ్చు. బయాలజీలో స్మార్ట్ స్టడీ టెక్నిక్ను అమలు చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని కాన్సెప్టుల వారీగా చదవాలి. చదివిన అంశాలను వారం రోజులకొకసారి రివిజన్ చేసుకోవాలి.
ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన గిరిజన యువతకు 45 రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సోమవారం తెలిపారు. అరకు డిగ్రీ కళాశాల హాస్టల్లో 120 మంది యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పాసైన ఆసక్తి గల యువత పాడేరు ఐటీడీఏలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని చెరువులో 50 ఏళ్ల లాకా సంజమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం రైతులు చెరువు కట్టపైంచి రైల్వే స్టేషన్ వైపు పంట పొలాలకు వెళ్తుండగా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.
PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్యాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. నాణ్యమైన ఉచిత విద్య అందించే సర్కారు బడులే మేలని అన్నారు.
KNR: క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి, చాటి చెప్పడానికి ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమం, ఎంతో దోహదపడుతుందని, కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో ప్రధానమంత్రి కీడే సంస్థ పోటీలను ఆయన ప్రారంభించారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.
KMR: అమెరికతో ట్రేడ్ డీల్ చేసుకుంటే ఏ దేశంతో భారత్కు యుద్ధం వస్తుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కామారెడ్డిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పిచ్చికూతలు కూస్తున్న రాహుల్ గాంధీ, ప్రజలు కాంగ్రెస్తో యుద్ధం చేస్తున్న విషయాన్ని మరిచిపోయారన్నారు. కరీంనగర్లో సైతం కాంగ్రెస్ను ఖతం చేసి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. రసాయన రంగులు వాడొద్దని అవి ఆరోగ్యానికి హానికరమని మంత్రి హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడుతూ హోలీని ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.