PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్యాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. నాణ్యమైన ఉచిత విద్య అందించే సర్కారు బడులే మేలని అన్నారు.