NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని చెరువులో 50 ఏళ్ల లాకా సంజమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం రైతులు చెరువు కట్టపైంచి రైల్వే స్టేషన్ వైపు పంట పొలాలకు వెళ్తుండగా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.