వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నటి కీర్తి సురేష్.. ప్రస్తుతం కన్నెవెడి, రఫ్తార్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. అయితే, ఈ బ్యూటీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ హిందీ దర్శకుడితో భారీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా కోసం చర్చలు జరుపుతోందట. కీర్తి కెరీర్లో మునుపెన్నడూ చూడని సరికొత్త జానర్లో ఈ సినిమా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.