ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన గిరిజన యువతకు 45 రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సోమవారం తెలిపారు. అరకు డిగ్రీ కళాశాల హాస్టల్లో 120 మంది యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పాసైన ఆసక్తి గల యువత పాడేరు ఐటీడీఏలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.