TPT: చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి జిల్లాలలోని పలు ఆలయాలను మంగళవారం మూసివేయనున్నారు. TTD ఆధ్వర్యంలోని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట,సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలను ఉదయం 9 గంటలకు మూసి, రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యథావిధిగా తెరిచి ఉంచుతారు.
NDL: చంద్రగ్రహణం సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాన్ని ఇవాళ ఉదయం 6 గంటలకు ఉభయ దేవాలయాల ద్వారాలు వేసి, రాత్రి 7.30 గంటలకు తెరవను న్నట్లు ఈవో ఎం. శ్రీనివాసరావు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు.
దక్షిణ సూడాన్లోని ఓ గ్రామంలో సాయుధులు జరిపిన దాడిలో 169 మంది మరణించారు. ప్రతిపక్ష నేత రీక్ మచర్ మద్దతుదార్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 90 మంది సాధారణ పౌరులు చనిపోయారని.. మృతుల్లో పిల్లలు, మహిళలు ఉన్నట్లు US మిషన్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత వెయ్యి మంది తమను ఆశ్రయించినట్లు తెలిపింది. చర్చల ద్వారా ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేతలు సంధి కుదుర్చుకోవాలని కోరింది.
HYD: MIM ఆధ్వర్యంలో సోమవారం మలక్పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దులహ్ బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలతో కలిసి విందు ఆరగించారు.
W.G: కోకాపేటలోని అల్లు స్టూడియోలో జరిగిన నటుడు అల్లు శిరీష్ వెడ్డింగ్ వేడుకలకు ఉండి ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో రఘురామతో పాటు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
MBNR: జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న విషయం తెలుసుకున్న MLA అనిరుధ్ రెడ్డి సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహతో మాట్లాడుతామన్నారు. ఘటనకు బాధ్యులైన సిబ్బంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
CTR: హోలీ సందర్భంగా జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేది) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.
GNTR: చంద్ర గ్రహణ ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేస్తున్నారు. సంప్రదాయాల ప్రకారం గ్రహణ కాలంలో ఆలయ ద్వారాలను నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. గ్రహణం ముగిసిన అనంతరం, ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి భక్తులకు అనుమతిస్తారు. కావున భక్తులు గమనించి సహకరించాలని కోరారు.
TPT: తిరుమలలో ఐదు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై పుష్కరిణిలో ఏడు ప్రదక్షిణాలు చేసి భక్తులను కటాక్షించారు. నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు అనంతరం స్వామివారిని పుష్కరిణికి తీసుకువచ్చారు.
ATP: జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సోమవారం సాయంత్రం సివిల్ సప్లయిస్ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో వీ.సీ. ద్వారా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు రేషన్ డీలర్లు అందుబాటులో ఉండి సరైన తూకముతో పంపిణీ చేయాలని ఆదేశించారు.
E.G: ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో 21 జారీ చేయడం పట్ల బిక్కవోలు బీజేపీ నాయకుడు చేవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామకృష్ణారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
HYD: తెలంగాణ ఉద్య మకారులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఛైర్మన్ కోతి మాధవి అన్నారు. తెలంగాణ ఉద్య మకారుల జేఏసీ రాష్ట్రకమిటీ సమావేశం కొత్తపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ఇంతకుముందు ఉన్న రాష్ట్ర కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
1839: టాటా గ్రూపు వ్యవస్థాపకులు జమ్షెట్జీ టాటా జననం1847: అలెగ్జాండర్ గ్రహంబెల్ జననం1938: తెలుగు హాస్య నటి గిరిజ జననం1967: గాయకుడు శంకర్ మహదేవన్ జననం1967: నక్సల్బరీ ఉద్యమం ప్రారంభం2002: తొలి దళిత లోక్సభ స్పీకర్ బాలయోగి మరణం* ప్రపంచ వినికిడి దినోత్సవం* ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
TG: కాంగ్రెస్ సర్కారుపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. SM వేదికగా విజయన్కు కౌంటర్ ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ, ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్ను లాగడం సరికాదన్నారు.
➠ తిథి: పౌర్ణమి సా.4:53 వరకు తదుపరి పాడ్యమి ➠ నక్షత్రం: మఖ ఉ.7:31 వరకు, తదుపరి పుబ్బ ➠ శుభ సమయాలు: ఉ.8:15-8:37, ఉ.9:26-11:11, మ.12:09-మ.1:08, మ.3:05-3:32, సా.5:10-6.00 వరకు ➠ రాహుకాలం: మ.3-4:30 వరకు ➠ యమగండం: ఉ.9-10:30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:38-9:25, రా.10:55-11:44 వరకు ➠ వర్జ్యం: మ.3:33-సా.5:09 ➠ అమృత ఘడియలు: ఉ.6:43 వరకు తిరిగి అర్ధరాత్రి రా.1:11 నుంచి 2.48 వరకు