E.G: ఇంద్రధనస్సు పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం జీవో 21 జారీ చేయడం పట్ల బిక్కవోలు బీజేపీ నాయకుడు చేవ చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి రామకృష్ణారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.