WNP: పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు పశు సంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్ సురేశ్ శనివారం తెలిపారు. పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయడం ద్వారా పశువుల మరణాలను తగ్గించవచ్చని అన్నారు. పాల ఉత్పత్తి తగ్గిపోకుండా కాపాడుకోవచ్చని, రైతులకు టీకాల గురించి అవగాహన కల్పించారు.