SDPT: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ సర్కార్ దిగివచ్చి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచిందని ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట మార్కెట్ యార్డులో మొక్కజొన్న ,పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు తెరవడంలో ఆలస్యం వల్లే 25 శాతం మొక్కజొన్న పంట దళారుల పాలయ్యిందన్నారు.