TG: అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనమండలి భవన పునర్నిర్మాణం పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఈనెల 8న ఉదయం 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మండలిలోని కొత్త హాల్ను ప్రారంభించనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు అక్కడి నుంచే ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సెంట్రల్ హాల్ నిర్మాణం జరుగుతుందని, దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించినట్లు మండలి ఛైర్మన్ తెలిపారు.