ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరంగా అనిపించడం సాధారణ సమస్య. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, మసాలా ఎక్కువగా తినడం, తగినంత నీరు తాగకపోవడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఇది జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే గ్యాస్ తక్కువ అవుతుంది. కప్పు వేడి నీటిలో సోంపు గింజలు మరిగించి వడకట్టి తాగడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది.