AP: రాష్ట్రంలో గుంతలమయంగా మారిన 4,158.10 కి.మీ. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ.514.50 కోట్లు మంజూరు చేసింది. 3,220.85 కి.మీ. మేర 655 జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.356.52 కోట్లు, 937.25 కి.మీ. మేర 202 రాష్ట్ర రహదారులకు రూ.143.48 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.