AP: రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతు ఇబ్బంది పడకూడదనే అనేక రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ‘నేనూ రైతు బిడ్డనే.. వారి కష్టాలు నాకు తెలుసు. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ.6 వేలు ఇస్తున్నాం. కేంద్రం రూ.6 వేలు ఇస్తే.. మేం రూ.14 వేలు ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నాం’ అని చంద్రబాబు వెల్లడించారు.