AP: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్.మోహన్రావు వెల్లడించారు. మార్చి 17 వరకు ఆలస్య రుసుము లేకుండా, రూ.1000తో మార్చి 21, రూ.2 వేలతో మార్చి 25, రూ.4 వేలతో మార్చి 30, రూ.10 వేలతో ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4-6 వరకు తప్పుల సవరించుకోవచ్చని చెప్పారు.