AP: మాతృభాషా వికాసమే మానవ జాతి ప్రకాశమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు కవుల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అస్తిత్వానికి మాతృభాష సుస్థిరమైన కోట అని తాను బలంగా విశ్వసిస్తానని తెలిపారు. సంస్కృతి, విలువలు, సంప్రదాయాలు అన్నీ భాషతోనే ముడిపడి ఉన్నాయన్నారు.