TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.