AP: టీడీపీ పనిగట్టుకుని తన ఇంటిపై దాడి చేయించిందని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘పార్టీలకతీతంగా కాపులు నాకు సంఘీభావం తెలిపారు. కూటమిలో ఉన్న కాపులు కూడా సంఘీభావం తెలిపారు. ఘటనలో కాపు కమ్యూనిటీలో ఒకరకమైన భావన ఏర్పడింది. అదేంటో రాబోయే రోజుల్లో చూస్తారు. నేను అనని మాటలను కూడా రిమాండ్ రిపోర్టులో పెట్టారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియకుండా జరిగాయా?’ అంటూ ప్రశ్నించారు.