తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి సర్వదర్శనానికి భక్తులు 23 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,426 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,889 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.