కోనసీమ: సోలార్ యూనిట్లు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రామరాజులంకలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతి యోజన పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ఇళ్లపై సోలార్ రూఫ్ ఏర్పాటు వల్ల విద్యుత్ ఖర్చు ఆధా అవుతుందన్నారు.