AP: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ మృతి బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సౌందర్ రాజన్ చేసిన ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయం. ఆలయాల సంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడేందుకు ఆయన విశేష కృషి చేశారు’ అని పేర్కొన్నారు.