AP: బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు అని మంత్రి లోకేష్ తెలిపారు. రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఎర్రన్నాయుడు పేరుగడించారని చెప్పారు. కేంద్రమంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా లోకేష్ నివాళులర్పించారు.