TG: సిద్ధిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగుల గొంతుకగా అసెంబ్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. ఉద్యోగులను రోడ్డపైకి తెచ్చిన ఘనత రేవంత్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ పెన్షన్ బెనిఫిట్ రాక చాలామంది చనిపోయారని వెల్లడించారు. వారి చావుకు రేవంతే కారణమని విమర్శించారు.