TG: ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడిది సాధారణ మరణం కాదని, పక్కాగా ప్లాన్ చేసిన సుపారీ హత్య అని ఖమ్మం పోలీసులు నిర్ధారించారు. నిందితులు శ్రీనివాస్ను హతమార్చి.. ఈ మొత్తం తతంగాన్ని కారు ప్రమాదంగా చిత్రీకరించారని దర్యాప్తులో తేలింది. ఇక శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్పై ఒక పుస్తకాన్ని రచించిన విషయం తెలిసిందే.