ఆవు, గేదె పాలపై రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ చేసిన వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.’ ఆవు దూడ జ్ఞానవంతురాలు, కానీ గేదె దూడ మేధోపరంగా అవినీతిపరుడు’ అని అన్నారు. ‘పిల్లలు ఉత్సాహంగా ఉండాలంటే ఆవుపాలు, సోమరిగా ఉండాలంటే గేదె పాలు తాగించాలి’ అని తెలిపారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.