TG: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ZPHSలో రాగి జావా తాగిన ఆరుగురు విద్యార్థులు కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. వారికి రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రాగి జావాలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.