NTR: నందిగామలో వార్డుల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 28 వార్డులను 32కు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. వార్డుల సంఖ్య పెరగడం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని అధికారులు అన్నారు.